19 August, 2026 | 3:12 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలక పాత్ర

13-07-2025 12:01 AM

అడిషనల్ డీసీపీ వెంకటరమణ..

కాప్రా: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అడిషనల్ డీసీపీ వెంకటరమణ(Additional DCP Venkataramana), ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) పేర్కొన్నారు. శనివారం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్, తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సీసీ కెమెరా వంద మంది మనుషులతో సమానమన్నారు. నేరాలు జరగకుండా నిరోధించడంలోనూ, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలోనూ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ జెర్రీపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారం శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, నాయకులు మునిగంటి రామ్ ప్రదీప్, ముత్యం వెంకన్న గౌడ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవం అనంతరం, అసోసియేషన్, స్కూల్ మైదానంలో మొక్కలునాటారు.