15 April, 2026 | 11:31 AM

నీటిపారుదల శాఖ కార్యాలయంలో వేడుకలు

07-11-2025 05:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రచించి  నేటికీ 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఉద్యోగులందరూ వందేమాతర గీతం ఆలపించడం జరిగింది. మన దేశం వందల సంవత్సరాల పైగా పరాయి పాలనలో ఉండడం స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన, ప్రాణ త్యాగాలు చేసిన నాయకులను గుర్తు చేసుకోవడం జరిగింది. వారి ఆశయాలను ముందు తీసుకెళ్లాలని ఇట్టి కార్యక్రమంలో డి.వెంకట రాజేంద్రప్రసాద్ సూపర్డెంట్ ఇంజనీర్, ఏం.లక్ష్మి డిప్యూటీ సూపర్డెంట్ ఇంజనీర్, టీఎన్జీవోస్ అధ్యక్షులు వెలుమల ప్రభాకర్ మరి ఉద్యోగులందరూ పాల్గొనడం జరిగింది.