15 April, 2026 | 12:07 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

శతాధిక వృద్ధురాలు మృతి

31-10-2025 01:08 AM

చేగుంట, అక్టోబర్ 30 :చేగుంటకు చెందిన శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మ(105) మృతి చెందారు. నర్సమ్మ 1920లో జన్మించారు.మొట్టమొదటి ఎన్నికల నుండి చివరి ఎంపీ ఎలక్షన్ వరకు అన్ని ఎన్నికలలో ఓటు వేసింది. తను 90 సంవత్సరాల వయస్సు వరకు పొలం పనులు చేశారు. మూడు నెలల ముందు వరకు కూడా తన పనులు తానే చేసుకున్నారు.

నర్సమ్మ భర్త మురాడి సాయిలు చేగుంటకు రెండవ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై మరణించే వరకు గ్రామానికి సేవ చేశారు. సర్పంచ్ కాకముందు చేగుంటకు ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై దాదాపు 26 సంవత్సరాలు సేవ చేశారు. వీరి కుమారుడు మురాడి ముత్యాలు చేగుంట పిఏసిఎస్ ఛైర్మెన్ గా పనిచేశారు. నర్సమ్మకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. కుమారుడు, పెద్ద కుమార్తె చనిపోగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.