21 August, 2026 | 8:28 PM

మాజీ ఎంపీపీ కుటుంబానికి చాడ పరామర్శ

12-07-2025 08:16 PM

చిగురుమామిడి,(విజయక్రాంతి): సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకట్రాజం ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా ఇందుర్తిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... వెంకట్రాజం లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం సీపీఐ కి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.