06-01-2026 05:05:59 PM
చేర్యాల: చేర్యాల పట్టణంలో బీడీ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో నేటినుంచి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దేవేందర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాటాడుతూ... చేర్యాల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు వైద్య అవసరలా కోసం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న పాత భవనం నుండి నూతనంగా నిర్మించిన కొత్త భవనంలోకి మార్చబడినది. కావున ప్రజలందరూ బుధవారం నుండి ఓపి,ఐపీ సేవలు నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే చూడబడును అని అన్నారు.