calender_icon.png 10 January, 2026 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు

09-01-2026 08:14:11 PM

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 15 రోజుల హుండీ ఆదాయం 1.08 కోట్లు

వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ కాలంలో భక్తుల నుంచి నగదు రూపంలో రూ.1,08,10,394,మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈఓ రమాదేవి సహా సంబంధిత అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించగా, ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.