13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

09-01-2026 08:06 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని మాసన్పల్లి గ్రామ శివారులో గల రాజారం ధాభ దగ్గర అక్రమంగా తరలిస్తున్న లారీ TS15UD0159లో సుమారు 200 క్వింటళ్ళు అందజా 20 టన్నులు రేషన్ బియ్యాన్ని కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ నమ్మదగిన సమాచారం మేరకు గుర్తించి పట్టకున్నారు. NH161 వ జాతీయ రహదారిపై భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని బిధర్ నుంచి నిజాం సాగర్ వైపు తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కల్హేర్ పోలీసులు లారీలో తనిఖీ చేసి పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ, డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవి గౌడ్ వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.