08-07-2025 01:01:09 AM
రామకృష్ణాపూర్, జూలై 7: క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డు లో ఈనెల 20న జరిగే ఆషాడ మాసం గాం ధారి మైసమ్మ బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి పరిశీలించారు.
సోమవారం రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీ రాజశేఖర్ తో పాటు గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అమ్మవారి ఆల యం పరిసరాలను, ఏర్పాట్లను పరిశీలించా రు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవ అధ్యక్షుడు పరుపెళ్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, భీమ సుధాకర్, కందునూరి రాజన్న, మోగిలి కనుకయ్య, గుండా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.