08-07-2025 01:54:49 AM
నల్లగొండ టౌన్, జూలై 7 : అవినీతి ని రోధక శాఖ అధికారులు జెట్ స్పీడ్ తో తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏ సీబీ అధికారులు అవినీతి అధికా రుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసిల్దార్ జావీ ద్ ను సోమవారం అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టు లో ప్రవేశపెట్టారు.
వివరాల్లోకి వెళ్తే నల్లగొండ జిల్లాలో అందులోనూ మిర్యాలగూడ డివిజ న్ పరిధిలో అక్రమంగా రేషన్ బి య్యం రవాణా చేస్తోన్న నాలుగు చ క్రాల ఆటోలు, ట్రాలీలను పోలీసులు పట్టుకున్నారు. సదరు రవాణా ఆటోలను అధికారు లు సీజ్ చేసి 6(ఏ) కేసులు నమో దు చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలోని మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసి ల్దార్ జావీద్ ను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు.
అయితే సివిల్ సప్లై శాఖ సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులతో కుమ్మకై బాధితుడు నుండి రూ.70 వేలు డి మాండ్ చేశాడు సదరు డిప్యూటీ తహసిల్దార్ జావీద్. ఆ సందర్భంలో అటు ఏసీబీకి, ఇటు జిల్లా పౌర సర ఫరాల శాఖ అధికారులకు చిక్క కుండా పరారీలో ఉండి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇటీవల స స్పెన్షన్ చేయడంతో డిప్యూటీ తాసి ల్దార్ జావీద్ పరారీలో ఉన్నాడు.