10-05-2025 10:59:06 PM
ఎల్లారెడ్డి మండలానికి 15 లక్షల 28 వేల రూపాయల,చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు 55 మంది లబ్ధిదారులకురూ.15.28 లక్షలు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా ఆధ్యర్యంలో కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఆయా గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులుమరియు యూత్ అధ్యక్షులు గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.