29 August, 2026 | 12:38 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

శ్రీశైలం లడ్డూలో బొద్దింక... అంతా ఫేక్

01-07-2025 01:05 AM

తేల్చేసిన అధికారులు

శ్రీశైలం, జూన్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో గల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దేవస్థాన అధికారులు ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. జూన్ 29 రోజు ఓ భక్తుడు ప్రసాదం అమ్మే దేవస్థాన సిబ్బందితో గొడవకు దిగాడు. తాను కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందని ఆ భక్తుడు ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలను దేవస్థాన అధికారులు కొట్టేశారు.