9 April, 2026 | 9:13 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కుప్పకూలిన స్టీల్ ప్లాంట్

27-09-2025 01:37 AM
  1. ఆరుగురు దుర్మరణం 
  2. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

రాయ్‌పూర్, సెప్టెంబర్ 26: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ కుప్పకూలడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. సిల్తారా ప్రాంతంలోని గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

‘ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆరుగురు కార్మికులు చనిపోగా.. మరో ఆరుగురు కార్మికులు గాయాల భారిన పడ్డారని తెలిసింది’ అని ఉన్నతాధికారి వెల్లడించారు. రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ మాట్లాడుతూ... ‘గోదావరి ఇస్పాత్‌లో పై కప్పు కూలిపోవడంతో కొంత మంది కార్మికులు దాని కింద చిక్కుకున్నట్టు మాకు సమాచారం అందింది.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. గాయపడ్డ ఆరుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.