27 June, 2026 | 7:05 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

06-12-2025 12:00 AM

మఠంపల్లి , డిసెంబర్ 5  : మండలంలోని మఠంపల్లి  క్లస్టర్‌లో మఠంపల్లి, గుండ్లపల్లి, రఘునాథపాలెం, చౌట పల్లి, బక్కమంతులగూడెం గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శుక్రవరం పరీశిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోకెన్ జారీ చేసిన నామినేషన్ పత్రాలు స్వీకరించటం జరుగుతుందని, అభ్యర్థులు ఆందోళన పడకుండా ఎన్నికల సిబ్బందికి సహకరించాలన్నారు.

నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సాయంత్రం 5 గంటలు దాటినా తర్వాత  నామినేషన్ కేంద్రం ఆవరణలో ఉన్న ప్రతి ఒక్క్కరికి టోకెన్స్ జారీ చేయటం జరిగిందని అభ్యర్థులు అందరు సిబ్బంది కి సహకరిస్తే మరో కౌంటర్ ఏర్పాటు చేసి వేగవంతంగా వరుస క్రమంలో నామినేషన్ పత్రాలు తీసుకుంటామని  తెలిపారు. అప్పటివరకు అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా కూర్చునేందుకు కుర్చీలు, త్రాగునీరు లాంటి మౌళిక వసతులు ఏర్పాటు చేపించారు.కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మంగ, ఎంపిడిఓ జగదీశ్, అధికారులు ఉన్నారు.