01-10-2025 12:48:51 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో దసరా నవరాత్రి ఉత్సవాల లో భాగంగా చండీయాగం నిర్వహించారు. దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో నవరాత్రి ఉత్సవాలలో భాగముగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం ముందు మంగళవారం ‘మహా చండీయాగం‘ కార్యక్రమం నిర్వహించరు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పాల్గొనడం జరిగింది.
అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి, అదనపు డీసీపీ ( ఏఆర్ ) రామచంద్రరావు , అదనపు కలెక్టర్ ( లోకల్ బాడీస్ ) అంకిత్, అదనపు కలెక్టర్ ( రెవెన్యూ ) కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వీయ, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహన్తో, డిఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ, ట్రేని కలెక్టర్ నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసిపిలు, సీఐలు ఎస్త్స్రలు పాల్గొన్నారు.