09-12-2025 02:14:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. నగరవ్యాప్తంగా వివిధ సమస్యలపై మొత్తం 226 ఫిర్యాదులు, అర్జీలు అందాయని అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 60 అర్జీలు స్వీకరించారు.