30-08-2025 04:43:06 PM
జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈకేవైసీ ఈకేవైసీ టీహెచ్ఆర్లలో నూరు శాతం పూర్తిచేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికార ఇండెంట్ వస్తుందని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.వి కృష్ణవేణి(District Child Welfare Officer K.V. Krishnaveni) అన్నారు. శనివారం నల్గొండ ప్రాజెక్ట్ పరిధిలోని చర్లపల్లి సెక్టార్ అంగన్వాడి టీచర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈకేవైసీ టిహెచ్ఆర్ ప్రకారంగానే నిధులు విడుదల చేస్తామని ప్రకటించిందని లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం ఈకేవైసీలు 96% ఉందని దాన్ని రేపటిలోగా నూరు శాతం టిహెచ్ఆర్ లు 66 శాతం మాత్రమే ఉందని దాన్ని రేపటిలోగా 90 శాతానికి పెంచితేనే వచ్చే నెలకు సంబంధించిన ఇండెంట్ వస్తుందని తెలిపారు. ఆన్లైన్ పూర్తి చేసిన వారికి మాత్రమే పౌష్టికాహారం అందించేందుకు వీలుంటుందని తెలిపారు. టీచర్లు అధికారులు సమన్వయంతో పని చేస్తూ వాటిని నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. చిన్నారులంతా ప్రైవేటు స్కూళ్లకు కాకుండా అంగన్వాడి కేంద్రాలకు వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. అంగన్వాడి సర్వే జనాభా వెయ్యి మందికి పైగా ఉంటే సర్వేలోని చిన్నారులందరిని నమోదు చేసి 20 మందికి తగ్గకుండా అంగన్వాడి స్కూల్ కి వచ్చేలా చూసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు అంగన్వాడి సెంటర్లు సమయానికి తీస్తూ సిబ్బంది యూనిఫామ్ ధరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అద్దె భవనాలు ఏమైనా శిధిలావస్థలో ఉంటే వెంటనే వాటిని మార్చాలని, కరెంటు ఇతర ప్రమాదం కలిగే సెంటర్లు ఉంటే వాటిని యజమాలతో చెప్పి మరమ్మతులు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో సిడిపిఓ తూముల నిర్మల సూపర్వైజర్ పార్వతి అంగన్వాడీ టీచర్లు కుర్షిదాబేగం, సుశీల, విజయ, రజిత, మంగ, సావిత్రమ్మ, పకృతాంబ, సునంద,పుష్పమ్మ, శంకరమ్మ, లావణ్య, లక్షమ్మ, శిరిష, అనిత తదితరులు పాల్గొన్నారు.