14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

వ్యవసాయాధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కీలకం

15-12-2025 03:37 PM

వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ,(విజయక్రాంతి): వ్యవసాయాధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం రేగొండ మండలం భాగిర్దిపేట క్రాస్ రోడ్డులో ఎస్బిఐ భూపాలపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన శ్రీ వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించాలంటే ఇలాంటి పరిశ్రమలు మరింతగా అవసరమని అన్నారు.

ఈ రైస్ మిల్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రైతులకు రవాణా ఖర్చులు తగ్గి లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి అనుకూల విధానాలు అమలు చేస్తోందని, స్థానిక పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట రామన్నగూడెం గ్రామ సర్పంచ్ గుగులోత్ రవళిక - వీరూ నాయక్ తదితరులు ఉన్నారు.