30-01-2026 12:00:08 AM
బూర్గంపాడు, జనవరి29 (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ,గృహానిర్మాణ,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బూర్గంపాడు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఇంగువ రమేష్, దారం కోటిరెడ్డి తదితరుల ఉన్నారు.