30-01-2026 12:02:42 AM
కుషాయిగూడ జనవరి 29 (విజయ క్రాంతి) : చర్లపల్లి డివిజన్లోని మారుతి ఎంక్లేవ్లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులతో కలి సి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పార్క్ అభివృద్ధి, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, పలు సీసీ రోడ్ల మంజూరుకు కాలనీ వాసు లు విజ్ఞప్తి చేయగా, త్వరలోనే అవసరమైన పనులు చేపడతామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు డి ఈ రూప, ఏ ఈ అభిలాష్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ పూర్ణ చం దర్, హార్టికల్చర్ నరేష్ కాలనీ అధ్యక్ష కార్యదర్శి సింగిరెడ్డి దేవేందర్ రెడ్డి, మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.