11 April, 2026 | 6:05 PM

Breaking News

నూతన ఎస్ఐ మహేందర్ ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం నేతలు   •   కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు   •   క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతుంది   •   కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి   •   భాగిర్తిపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం   •   సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే   •   అక్షరాయుధంతో అణచివేతపై పోరాడిన ధీశాలి పూలే   •   జెక్ కాలనీలో చలివేంద్రం ప్రారంభం   •   తల్లి జ్ఞాపకార్థం మున్సిపల్ కార్మికులకు టిఫిన్ బాక్సులు అందజేత   •   CAA అమలు వేగవంతం— చొరబాటుదారులు సామాన్లు సర్దుకోవాల్సిందే! మోదీ హెచ్చరిక   •  

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోదీ

29-12-2025 02:20 AM

కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు

ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగించి.. ఆ పథకాన్ని పూర్తిగా మార్చే కుట్ర చేస్తోంది 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్  28 (విజయక్రాంతి): దేశంలో రాజ్యాంగాన్ని నీరుగార్చి.. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయా లు తీసుకుంటుందని మండిపడ్డారు. జాతీయ ఉపా ధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించి .. ఉపాధి హామీ పథకాన్ని మార్చాలనే కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల త్యా గంతోనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, అజారుద్దీన్, పార్టీ నేతలు హాజరయ్యారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఇందిరా, రాజీవ్ గాంధీలే కారణమన్నారు. ఈ  సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ప్రపంచలోనే అత్యంత పురాతనమైనది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిందని, స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేదని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. మహనీయుల త్యాగం ముందు అధికార దాహంతో రాజ్యమేలుతున్న నాయకలు ఎంత ..? అని ఆయన నిలదీశారు. నెహ్రూ ప్రధాని కాకుండా ఉండి ఉంటే ఈ దేశం ఏమయ్యేదో ఊహించలేమని, ఆయన పోషించిన పాత్ర వల్లే దేశం ఈ స్థాయికి ఎదిగిందన్నారు.

పాకిస్తాన్‌కు ఇందిరాంగాంధీ అంటే గడగడలాడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు మోదీ మాత్రం పాకిస్తాన్‌కు భయపడుతున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరిలో స్మార్ట్ పోన్ ఉండటానికి కారణం రాజీవ్‌గాంధీ దూరదృష్టినేనని అన్నారు. పీవీ నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆ తర్వాత మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ మదిలో నుంచి పుట్టిన మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి పథకాన్ని తీసుకొస్తే.. మోదీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమానంగా ఫలాలు అందాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కుల సర్వే నిర్వహించిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తే .. బీజేపీ అడ్డంపడిందన్నారు. బీజేపీ విధానాలకు బీఆర్‌ఎస్ వంతపాడుతోందన్నారు.