calender_icon.png 18 August, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి

18-08-2025 10:17:09 PM

 సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ

నకిరేకల్(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) కట్టంగూర్ మండల 7వ మహాసభ  కొమ్ము వినోద్, ఏ యాదమ్మ అధ్యక్షన నిర్వహించారు. 

ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర మేము అధికారంలోకి వస్తే కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని ఆయన విమర్శించారు.వేతనాలు కూడా సకాలంలో కార్మికులకు ఆందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడితేనే వేతనాలు వచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు.

గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలు చేసినప్పుడు తమ మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ తీరుస్తామని చెప్పిన వారు నేడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు సెలవు ఇవ్వకుండా అధిక పనిగంటలతో స్పెషల్ ఆఫీసర్ల వేధిస్తున్నారని ఆరోపించారు. సెలవులపేరుతో వేతనాలు అడ్డగోలుగా కోత విధిస్తున్నారని అన్నారు. బట్టలు సబ్బులు చెప్పులు నూనెలు, ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్న నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారని అన్నారు.సెప్టెంబర్ లో జరిగే యూనియన్ రాష్ట్ర జిల్లా మహాసభల్లో కార్మిక సమస్యలు చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందిస్తామన్నారు.