16-09-2025 10:44:40 PM
రాజాపూర్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ఫరితాగతిన పూర్తి చేయాలని హౌసింగ్ డిఇ శివకుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. తిరుమలాపూర్ గ్రామంలో అధిక మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారని అన్నారు. స్లాబ్ వేసిన అతియా బేగం, వడ్ల పారిజాత ఇల్లు స్లాబ్ లెవల్ గోడలు పూర్తయిన ఇండ్లను పరిశీలించారు. నిర్మాణం పూర్తి వారు బిల్లుల కొరకు ఇందిరమ్మ యాప్ లో క్యాప్సర్ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులను అభినదించారు.