14 April, 2026 | 5:15 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

ఆదిభట్లలో అవినీతి జలగలు

14-11-2025 12:00 AM

రూ.75 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీపీవో, టీపీఏ

ఇబ్రహీంపట్నం, నవంబర్ 13: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్.. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీ ద్వారా ఓ బిల్డింగ్ అనుమతి విషయంలో రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మునిసిపాలిటీ పరిధిలో ఓ ఇంటి అనుమతి కోసం మోత్కూరి ఆనంద్ అనే వ్యక్తి నుంచి 400 గజాల్లో 4 అంతస్తుల కోసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని టీపీవో వరప్రసాద్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రమించాడు. రూ. 80 వేలకు  కుదుర్చుకున్న ఒప్పందంలో రూ.75 వేలు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.