05-05-2025 06:37:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబడుతున్న కోర్టులకు సొంత స్థలాలు కేటాయించి భవన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. సభ్యులు మల్లారెడ్డి వెంకటరమణ ఎంసీ లింగన్న తదితరులు సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి న్యాయం జరిగేటట్లు చూడాలని కోరారు.