18 July, 2026 | 1:28 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఇండియా కూటమికి బీటలు

19-07-2025 12:36 AM
  1. కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్న ఆప్
  2. ఇండియా కూటమిలో లేమని ప్రకటించిన ఆమ్‌ఆద్మీ

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేడు సమావేశం కావాలని ఇండియా కూటమి భావించింది. అయితే ఈ సమావేశానికి హాజరు కావొద్దని ఆప్ నిర్ణ యించింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూట మితో కలిసి పని చేశాం కానీ ప్రస్తు తం కూటమిలో లేమని ఆప్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటన చేశారు.

శనివారం జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం లేదన్నారు. మరో పక్క తృణముల్ కాంగ్రెస్ మాత్రం నేటి సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించింది. ఆ పార్టీ తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హాజరవనున్నారు.