06-10-2025 12:00:00 AM
వెల్దండ అక్టోబర్5. ఖరీఫ్ లో సాగుచేసిన పంటలను రైతులు విధిగా నమోదు చేసుకోవాలని పెద్దాపూర్ బొల్లంపల్లి వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గణేష్ ట్రాక్యానాయకులు అన్నారు. ఆదివారం బొల్లంపల్లి పెద్దాపూర్ క్లస్టర్ గ్రామాల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాల్లో సర్వేనెంబర్లు వారిగా సర్వే జరుగుతుంది రైతులు అందుబాటులో ఉండి పట్టాదారు పాస్ పుస్తకాల్లో సర్వే నెంబర్ల వారీగా పంటల నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు గ్రామస్తులుపాల్గొన్నారు.