calender_icon.png 20 August, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు

20-08-2025 07:40:42 PM

అగమవుతున్న రైతులు

కామారెడ్డి (విజయక్రాంతి): రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు పొలాల్లో వరదనీరు చేరింది. పిట్లం మండలంలోని చిన్నకొడప్​గల్ గ్రామ శివారులోని ఎల్లయ్య చెరువు ఆయకట్టు పూర్తిగా నీటమునిగింది. పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. దీంతో బుధవారం వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారి సురేష్(Agriculture Department Extension Officer Suresh) ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.