16 March, 2026 | 2:59 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

భక్తసంద్రం.. టోంకిని ఆలయం

05-11-2025 01:07 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్4(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణం నుంచి బోంకిని సిద్ది హనుమాన్ ఆలయం వరకు మంగళవారం నిర్వహించిన 24వ మహాపాదయాత్రకు భక్తజనం పోటెత్తింది.  తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రారం భమైన మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాలోని పలు మండలాల నుండి కాకుండా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర నుండి  20 వేల మందికిపైగా తరలి రావడంతో దారులన్నీ కిక్కిరిశాయి.

భక్తులు ఆలయానికి చేరు కొని క్యూ కట్టి అంజన్నను దర్శించుకున్నారు. దేవస్థానం పరిసరాలు కిటకిటలాడాయి. సిర్పూ ర్(టీ) నియోజకవర్గ పరిధిలోని అధికారులు, రాజకీయ నాయకులు స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.స్వచ్చంద సంస్థలు, రాజకీయ నాయకులు పండ్లు, మజ్జిగ, పాలు, చాయ్ అందించారు. మహాపాదయాత్రగా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.