17 June, 2026 | 8:38 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ప్రమాదభరితంగా కల్వకుర్తి-- రహదారి

29-11-2025 12:54 AM

భారీ గోతులు.. పట్టించుకోని అధికారులు..

కల్వకుర్తి, నవంబర్ 28 : కల్వకుర్తి తెలకపల్లి ప్రధాన రహదారిలో పంజుగుల సమీపంలో రోడ్డుపై భారీ గోతులు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  కల్వకుర్తి నుండి మాజీ ఎంపీ పోతుగంటి రాములు స్వగ్రామమైన గుండూరు వరకు ఐదేళ్ల క్రితం రెండు వరుసల రహదారి నిర్మించారు.   నాటి నుండే అక్కడక్కడ గోతులు ఏర్పడి అవి పెద్దయిగా మారాయి.  ఆరు నెలలుగా పరిస్థితి మరింత అధ్వానంగా మారి  రోజు రోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు, ప్రయానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల భారీగా పెరిగిన ఇసుక టిప్పర్ల రాకపోకలే ఈ దెబ్బతినడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కంకర, ఇసుక ఓవర్లో డ్తో నడుస్తున్న ట్రక్కులు రహదారిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఏర్పడిన లోతైన గోతులను గమనించకుండా వెళ్లిన పలువురు వాహనదారులు కింద పడిపోవడం, వాహనాలు దెబ్బతినడం వంటి సంఘటనలు తరచూ నమోదవుతున్నాయి.

ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ మార్గంలో కొత్తగా వెళ్లే వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు భవనాల శాఖ తక్షణమే మరమ్మతులు చేపట్టి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ ఓవర్లోడ్ ఇసుక టిప్పర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలినీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.