9 May, 2026 | 10:15 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

విద్యార్థి మనోహర్ మృతి అత్యంత బాధాకరం

20-09-2025 11:27 PM

మనోహర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన కుక్కడప్పు నాగేశ్వరరావు కుమారుడు మనోహర్ గత నెల రోజుల క్రితం  వరద కాలవలో పడి చనిపోవడం అత్యంత బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థి అతి చిన్న వయసులో మృతి చెందారని వారి కుటుంబానికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన ఐదు లక్ష రూపాయలను చెక్కును మృతి చెందిన విద్యార్థి తండ్రి నాగేశ్వరావుకు అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి నాగేశ్వరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.