09-07-2025 04:27:14 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలోని శ్రీ దుర్గాభవానీ ఆలయం(Sri Durga Bhavani Temple)లో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని బెండ కాయల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.