05-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూలై 4(విజయక్రాంతి):కరీంనగర్ రూరల్ మండలం నగునూర్లోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదుర్గాభవానీ అమ్మవారిని వివిధ పండ్ల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులలో భాగంగా చండీ హోమం నిర్వహించారు.
స్త్మ్రల్ కిట్టి పార్టీ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం, చీరెసారె సమర్పించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులుపాల్గోన్నారు.