05-07-2025 07:57:01 PM
బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల ఎస్సైగా దీపక్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై వెంకట్రావును విఆర్ కు పంపారు. దీపక్ కుమార్ కరీంనగర్ నుండి బదిలీపై లింగంపేట్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. లింగంపేట మండలంలో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నూతన ఎస్సైకి పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.