16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రామచంద్రపురం జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ షెడ్ల కూల్చివేత

18-12-2025 04:45 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురం జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను అతిక్రమిస్తూ ప్రజా స్థలాలు, ప్రధాన రహదారులకు అడ్డుగా ఏర్పాటు చేసిన షెడ్లను గుర్తించిన అధికారులు వాటిని తొలగించారు. అక్రమ నిర్మాణాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రాకపోకలకు అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ముందస్తుగా నోటీసులు జారీ చేసినప్పటికీ యజమానులు స్పందించకపోవడంతో కూల్చివేతకు దిగాల్సి వచ్చిందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.