10 June, 2026 | 3:38 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

మత్స్యాద్రిలో ఘనంగా "ధ్వజారోహణం"

01-11-2025 05:18 PM

గరుడ ముద్ద కోసం పోటీపడిన భక్తులు

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ధ్వజారోహణ సందర్భంగా పూజారులు ఎగరవేసిన స్వామివారి అత్యంత పవిత్రమైన గరుడ ముద్ద కోసం భక్తులు పోటీపడ్డారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విష్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచనం, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అగ్ని ప్రతిష్ఠ, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభారాధన, పూర్ణాహుతి, శేషవాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్  కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, ఈవో సల్వాది మోహన్ బాబు, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.