16 April, 2026 | 10:46 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బండేనక బండి కట్టి..

28-01-2026 12:36 AM

ఎడ్లబండ్లపై మేడారం జాతరకు భక్తజనం

సంప్రదాయ పద్ధతిలో భక్తుల ప్రయాణం

ములుగు/మేడారం, జనవరి జనవరి 27 (విజయక్రాంతి): మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ములుగు కేంద్రం నుంచి భక్తు లు సోమవారం రాత్రి సంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండ్లపై బయలుదేరి మేడారం వైపు ప్రయాణం సాగించారు. ఎడ్లబండ్లను పూలతో, జెండాలతో అలంకరించి, డప్పులు, -ఢోలు మోగి స్తూ భక్తులు జై సమ్మక్క నినాదాలతో అడవీ మార్గాలను దాటారు. తమ పూర్వీకుల నాటి సంప్రదాయమని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం గర్వంగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ఎడ్ల బండ్లపై వెళ్లే భక్తులు ముందుగా గుడియమ్మ గుడి వద్ద పూజ లు చేసి కుంకుమ, పసుపు, కొబ్బరికాయ సమర్పిస్తారు.