25-12-2025 12:45:41 AM
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 24: దైవభక్తి అందరిలో ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం ఎనుగొండ లోని పోచమ్మ కాలనీ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీశైలం నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.