13 July, 2026 | 9:51 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

అనుమతిలేని కోచింగ్ సెంటర్‌లను నిలిపి వేయాలని ధర్నా

19-09-2025 12:00 AM

మోతె, సెప్టెంబర్ 18: అనుమతి లేని కోచింగ్ సెంటర్‌లను వెంటనే నిలిపి వేయా లని కోరుతూ బహుజన విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యం ఈ ఓ కార్యాలయం ముందు  గురు వారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా బహుజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు మంద కమలాకర్ మాట్లాడుతూ మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డులోని విజేత  కోచింగ్ సెంటర్ ను అను మతులు లేకుండా నిర్వహించడం సరికాద న్నారు.

విద్యార్థులకు రోజు వారి హాజరు, యఫ్‌ఆర్ ఎస్ ఎట్లా చేస్తున్నారని మండిప డ్డారు. కోచింగ్ ల పేరిట పిల్లల జీవితాలతో ఆటలు ఆడొద్దన్నారు. జిల్లా, మండల విద్యాశాఖఅధి కారుల కను సైగల్లోనే విచ్చల విడిగా ప్రెవేట్ పాఠశాలల్లో కోచింగ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అక్రమంగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేయా లని డిమాండ్‌తో కూడిన వినతిపత్రం యంఇఓ కె. గోపాల్ రావుకు అందించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.