6 May, 2026 | 9:30 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

వ్యక్తి అదృశ్యం

09-08-2025 10:00 PM

ఘట్ కేసర్: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్(SI Shekhar) తెలిపిన వివరాల ప్రకారం... ఎగిడి రామకృష్ణ(45) అనే వ్యక్తి ఘట్కేసర్ మైసమ్మగుట్ట దగ్గర గల దామోదర్ రెడ్డి కోళ్ల ఫారం నందు ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపూర్ జిల్లా, వజ్రకరూర్ కు చెందిన అతను వలస వచ్చి భార్యా పిల్లలతో కలిసి మైసమ్మ గుట్ట దగ్గర కల కోళ్ల ఫారం నందు నివసిస్తున్నాడు.

ఈనెల 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు అతను ఇంటి నుండి బయటకు వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. రామకృష్ణకు వేరే మహిళతో సంబంధం ఉందని, ఆమెతో వెళ్లిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పిపోయిన వ్యక్తి క్రీమ్ కలర్ షర్ట్, నల్ల ప్యాంటు, ఎత్తు 5.2'', రంగు నలుపు, చేతిపై టాటూ ఉంది. అతని గురించి భార్య పిల్లలు బంధుమిత్రుల వద్ద అన్ని చోట్ల వెతికిన ఎలాంటి ఆచూకీ దొరకపోవడంతో శనివారం రామకృష్ణ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.