09-08-2025 11:28:45 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రక్షాబంధన్(Raksha Bandhan) సందర్భంగా కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం హిందూ ప్రియ చంద్రశేఖర్ రెడ్డి శనివారం హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు.