05-07-2025 08:59:59 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సామాజిక సేవకులు రూప్లా నాయక్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో వివేక్ జైన్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో, పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లక్ష్మీప్రసన్న సిడిపిఓ చేతులమీదుగా, జగన్నాధపురం సెక్టార్ రంగాపురం అంగన్వాడి కేంద్రం నందు 12 వేల రూపాయల ఆర్థిక సహకారంతో 20 కుర్చీలను అంగన్వాడి కేంద్రానికి అందజేయడం జరిగింది.