20-05-2025 12:51:42 AM
కల్లూరు,మే19(విజయ క్రాంతి)వేంసూరు మండలం భరిణిపాడు లో సోమవారం రైతన్నలకు జీలుగు విత్తనాలను సత్తుపల్లి శాస నసభ్యులు మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతీ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అని, దేశం లో ఎక్కడ లేని వి దంగా ఒక్క తె లంగాణ రాష్ట్రము లోనే ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్యులు బట్టి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ,పొంగులేటి రాష్ట్ర మంత్రులు ఆధ్వర్యంలో రైతు సోదరుల కు అద్భుతమైన పథకాలు అందిస్తుంది దాన్నారు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మా ర్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, వైస్ చైర్మ న్ వెంకటప్పారెడ్డి, కందుకూరు సొసైటీ చైర్మ న్ గొర్ల సంజీవ రెడ్డి,కూరపాటి నాని,ఎవో, ఎఈవో, ప్రభుత్వ అధికారులు, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.