30 June, 2026 | 10:36 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కోటి 22 లక్షల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

03-05-2025 11:00 PM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ టౌన్, బాన్సువాడ రూరల్ నసరుల్లాబాద్, బీర్కుర్, మండలాలకు చెందిన  కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 122 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ టౌన్ 44 మంది లబ్ధిదారులకు రూ.44,05,104/-, బాన్సువాడ రూరల్ 37 మంది లబ్ధిదారులకు రూ.37,04,292/-, నసరుల్లబాద్ మండలం 19 మంది లబ్ధిదారులకు రూ.19,02,204/-, బీర్కుర్ మండలంలో 22 మంది లబ్ధిదారులకు రూ.22,02,552/-, మొత్తం 122 లబ్ధిదారులకు రూ 1,22,14,152/- లనులబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, నస్రుల్లాబాద్ తాసిల్దార్, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.