30 June, 2026 | 9:43 PM

Breaking News

రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •  

అప్పుల బాధతో యువకుడు మృతి

03-05-2025 10:54 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరేసుకొని మార్క రాజేందర్(37) వ్యక్తి మృతి చెందినట్లు ప్రొబేషనరీ ఎస్సై శశాంక్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మార్క రాము అనే వ్యక్తి  కాటారం మండలం చిందినపల్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి కాటారం మండలం కేంద్రంలో ఫర్టిలైజర్ షాపును నిర్వహిస్తున్నాడు.

ఇతడి వద్ద రైతులు ఎరువులు పురుగుమందులు తరువాత చెల్లిస్తానని చెప్పి ఉద్దేరకు తీసుకొని పోవడం జరిగిందని తద్వారా అతను రూ.20 లక్షలు  అప్పు  ఉండడం జరిగిందని దీనితో అతను తీవ్రమైన మనస్థాపం చెంది గత నెల 28 వ తేదీ నాడు ఇంటి నుండి వెళ్లిపోయినాడు. మహాదేవపూర్ పరిసర ప్రాంతాలలో గల అయ్యప్ప స్వామి గుడి సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని శనివారం చనిపోయాడు. అతడి భార్య మార్క స్రవంతి ఫిర్యాదు మేరకు మహాదేవపూర్ ప్రొఫెషనరీ ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.