09-05-2025 11:01:39 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): పేదింటి ఆడపిల్లల కు అండగా నిలిచేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగ పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఆర్థికంగా అండగా కళ్యాణ లక్ష్మి పథకం దో హ ద పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.