20 June, 2026 | 4:09 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

అదనపు కలెక్టర్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

23-09-2025 12:00 AM

ప్రజల భద్రత దృష్ట్యా కార్యాలయం మార్పు

అదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : ప్రజలు తమ సమస్యల పరిష్కా రానికి కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం, ప్రజల భద్రత దృష్ట్యా అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల భారీ వర్షానికి ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని కొంత భాగం కూలిపోవడంతో అందులోని వివిధ విభాగాల కార్యాలయాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు.

ఇందులో భాగంగానే అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని పెనుగంగా భవన్ కు మార్చడంతో సోమవారం నూతన అదరపు కలెక్టర్ భావనాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ని శాలువతో సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని, ఏవో వర్ణ, పలు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.