calender_icon.png 8 July, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలను జిల్లా అధికారులు త్వరితగతిన పరిష్కరించాలి

08-07-2025 12:03:04 AM

జిల్లా కలెక్టర్ సంతోష్

గద్వాల, జులై 07 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలె క్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సము దాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 60 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారు లు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. నేటి వరకు వివిధ శాఖలలో అర్జీలు అపరిస్కృతంగా ఉన్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా హాజ రు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.