26-07-2025 07:28:58 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందులకు గాను దుమ్ముగూడెం సీఐగా విధులు నిర్వర్తిస్తున్న బి.అశోక్ కు డీఎస్పీగా పదోన్నతిని కల్పిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju)ను ఎస్పీ కార్యాలయంలో శనివారం ఇన్స్పెక్టర్ అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీగా పదోన్నతి పొందిన బి.అశోక్ ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.