19-10-2025 08:45:26 PM
అయిత పరంజ్యోతి..
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట పట్టణ ప్రజలకు, ప్రముఖ సంఘాసేవకులు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ, దీపావళి అనగా చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారదోలే, వెలుగులను నింపే పండుగ దీపావళి అని, చేగుంట మండల, పట్టణ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ పర్వదినాన్ని కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పిల్లలు టపాకాయలు కాల్చే సమయంలో, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు సూచించారు. పట్టణ ప్రజలపైన లక్ష్మీదేవి అనుగ్రహం, ఉండాలని, అందరికీ శుభం చేకూరాలని, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.