25 March, 2026 | 2:20 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •  

దొడ్ల డెయిరీ మేనేజర్‌పై దుకాణ యజమాని తల్వార్‌తో దాడి

09-01-2026 12:45 AM

ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం కీసరలో ఘటన 

మేడ్చల్, జనవరి 8 (విజయ క్రాంతి): పాత బకాయిలు చెల్లించే వరకు పాల ప్యాకెట్లు ఇవ్వబోమన్నందు కు దుకాణ యజమాని, డెయిరీ మేనేజర్ పై తల్వార్ తో దాడికి పాల్పడిన ఘటన కీసరలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం కీసరలో పాల దుకాణం నిర్వహించే కిరణ్ దొడ్ల డెయిరీ కి బకాయి పడ్డాడు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్ల డెలివరీ సమయంలో పాత బకాయి లు చెల్లిస్తేనే పాల ప్యాకెట్లు ఇస్తామని మేనేజర్ కే శ్రీనివాస్ తెలిపారు.

ప్యాకెట్లు ఇవ్వొద్దని వ్యాను డ్రైవర్ కు మేనేజర్ చెప్పాడు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ తల్వార్ తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై శ్రీనివాస్ అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మౌలాలికి చెందిన వాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడు కిరణ్ పరారీ లో ఉన్నాడు.